లోకల్ మండి
జిల్లా | మండి | కనిష్ట రేటు | గరిష్ట రేటు | సగటు రేటు |
---|
ఇజ్రాయెల్ అండర్ అటాక్- ప్రధాన నగరాల్లో విధ్వంసం..!
గాజాలో హమాస్, లెబనాన్లో హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూపులపై వరుసబెట్టి దాడులు సాగిస్తూ వచ్చిన ఇజ్రాయెల్ మరో అడుగు ముందుకేసింది. ఇప్పుడు తాజాగా ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుంది. ఏకంగా ఆ దేశ ప్రధాన టెహ్రాన్ పై విరుచుకుపడుతోంది. వైమానిక దాడులను సాగిస్తోంది. మిస్సైళ్లతో విధ్వంసాన్ని సృష్టిస్తోంది.
రెండున్నర సంవత్సరాలుగా ప్రతీకారదాడులతో ఏడాదిన్నర కాలంగా మధ్య తూర్పు దేశాలు భగ్గుమంటోన్న విషయం తెలిసిందే. రోజుల తరబడి దాడులు ప్రతిదాడులు కొనసాగుతోన్నాయి. ఈ రీజియన్ చల్లారట్లేదు. ఇజ్రాయెల్, గాజా, లెబనాన్ రోజూ పరస్పర దాడులకు దిగుతోన్నాయి.ఇప్పుడు ఇజ్రాయెల్.. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ దాడులకు Raising Lion అని పేరు పెట్టింది. గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత తొలి దాడి చోటు చేసుకుంది. జనావాసాలను కూడా లెక్కపెట్టట్లేదని ఇరాన్ మీడియా తెలిపింది.ఈ దాడుల్లో- అత్యంత శక్తిమంతమైన ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్ చీఫ్ హొస్సేన్ సలామీ మరణించినట్లు తెలుస్తోంది. అలాగే న్యూక్లియర్ సైంటిస్ట్ కూడా దుర్మరణం పాలైనట్లు టస్మిన్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఇరాన్ అణ్వాయుధ డిపోలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది టస్మిన్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.

"దీనికి ప్రతీకారానికి దిగింది ఇజ్రాయెల్. ఇరాన్ నగరాలపై భారీగా బాలిస్టిక్ మిస్సైళ్లను సంధించింది.," దాదాపుగా 200కి పైగా క్షిపణులను ప్రయోగించింది. అర్ధరాత్రి నుంచి రెండు విడతల్లో ఈ దాడి సాగింది. ఇజ్రాయెల్ ప్రధాన నగరాలు.. టెల్ అవివ్, జెరూసలేంను టార్గెట్ గా చేసుకుంది.
తాజా వార్తలతో నవీకరించండి!
'గుండెల్లో ధైర్యం ఉన్న నాయకుడే.. యుద్ధాన్ని గెలుస్తాడు’
మేడ్చల్ జిల్లా: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆపరేషన్ సిందూరు కాంగ్రెస్ పూర్తి మద్దతిస్తే, యుద్ధం ఆపేసినప్పుడు అఖిలపక్షాన్ని ఎందుకు పిలవలేదంటూ ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ రోజు(గురువారం) మేడ్చల్ జిల్లా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్.. ప్రధాని మోదీని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గుండెల్లో ధైర్యం ఉన్న నాయకుడే.. యుద్ధాన్ని గెలవగలడు అంటూ ప్రధాని మోదీని విమర్శించారు.'ఉగ్రదాడి తర్వాత కేంద్రానికి పూర్తిగా మద్దతిచ్చాం. యుద్ధాన్ని ఆపాలనుకున్నప్పుడు అఖిల పక్షాన్ని ఎందుకు పిలవలేదు?, మన భూభాగాన్ని చైనా ఆక్రమిస్తుంటే మోదీ ఏం చేస్తున్నారు?, అమెరికా ఒత్తిడికి తలొగ్గి యుద్ధం ఆపేశారా?, మన పౌరులపై తూటాలు పేల్చిన దేశాన్ని తుడిచేయాలని ప్రధానిని కోరాం.
న్యూస్ క్యాటగిరీష్
శక్తి పోరాటాలు మరియు విధాన మార్పులు, సమతుల్య కోర్ మరియు డైనమిక్ సంస్కరణలతో బలమైన నాయకత్వం.


తాజా సినిమా అప్డేట్స్!

“రానా దగ్గుబాటి” ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ “రానా నాయుడు” నిన్న అధికారికంగా ఓటిటిలో విడుదలైంది.
ఈ సిరీస్లో వెంకటేష్ కూడా కీలక పాత్రలో కనిపిస్తున్నారు, ఇది వారి తొలి వెబ్ సిరీస్ ప్రాజెక్ట్ కావడం విశేషం.
ఈ క్రైమ్ డ్రామాలో కుటుంబం, గ్యాంగ్స్టర్ వాతావరణం, భావోద్వేగాల మిళితంతో ఆకట్టుకునే కథనాన్ని అందించారు.
నెట్ఫ్లిక్స్ లో విడుదలైన ఈ సిరీస్ ఇప్పటికే ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను పొందుతోంది.
నిన్నటి నుంచి తెలుగు, హిందీ భాషల్లో స్ట్రీమింగ్కి అందుబాటులో ఉంది. రానా, వెంకటేష్ నటన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
ఇది రానా మరియు వెంకటేష్ కలిసి నటించిన తొలి వెబ్ సిరీస్ కావడం విశేషం. డైరెక్షన్, నటన, బిజీ స్క్రీన్ప్లే అన్నీ కలిసొచ్చి “రానా నాయుడు”ను హిట్ గా నిలిపాయి.